ఢిల్లీ హిట్ అండ్ డ్రాగ్ కేసు: 10లక్షల పరిహారం ప్రకటించిన కేజ్రీవాల్

ఢిల్లీ హిట్ అండ్ డ్రాగ్ కేసు: 10లక్షల పరిహారం ప్రకటించిన కేజ్రీవాల్

ఢిల్లీలో సంచలనంగా మారిన హిట్ అండ్ డ్రాగ్ కేసులో చనిపోయిన మహిళ తల్లితో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. బాధిత మహిళ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేస్తామని, ఆ మహిళకు న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. దాంతో పాటు పెద్ద లాయర్ ను రంగంలోకి దింపుతానని, ఆమె తల్లికి మెరుగైన చికిత్స అందిస్తానని స్పష్టం చేశారు. ఆ కుటుంబానికి భవిష్యత్తులో ఇంకేదైనా అవసరం వస్తే కూడా ఆదుకుంటామన్నారు.

ఇక ఈ కేసులో చనిపోయిన మహిళ లైంగిక వేధింపులకు గురైనట్టుగా ఎలాంటి గాయాలు కాలేదని ఇటీవల రిలీజైన యువతి పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. అయితే ఆమెకు తల, వెన్నెముక, ఎడమ తొడ భాగాల్లో ప్రమాదం కారణంగా తీవ్ర రక్తస్రావం జరిగిందని అధికారులు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన తుది నివేదిక వెలువడుతుందని చెప్పారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఓ కారును గుర్తించిన అధికారులు.. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.