Kantara 2: కాంతార సీక్వెల్ పై క్రేజీ అప్ డేట్ ఇచ్చిన మేకర్స్

Kantara 2: కాంతార సీక్వెల్ పై క్రేజీ అప్ డేట్ ఇచ్చిన మేకర్స్

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార గతేడాది ఊహించని రీతిలో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. సప్తమి గౌడ హీరో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం.. కేవలం 25 కోట్లతో తెరకెక్కి రూ.400కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ఈ సినిమా ఆస్కార్ క్వాలిఫై లిస్ట్ లో స్థానం దక్కించుకొని సంచలనం సృష్టించింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు కాంతార సీక్వెల్ కు మేకర్స్ పచ్చజెండా ఊపారు. కాంతార పార్ట్ 2 ఉంటుందని గతంలోనే ప్రకటించినప్పటికీ.. మూవీ ప్రారంభానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని హోమబలే నిర్మాణ సంస్థ సినీ ప్రియులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కాంతార సెకండ్ పార్ట్ కు స్ర్కిప్టు రాయడం మొదలైందని ట్వీ్ట్ ద్వారా తెలిపింది.

నిజం చెప్పాలంటే ఇది కాంతారకు సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ గా ఉండబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయు. కాంతార మూవీ పార్ట్ 1లో హీరో తండ్రి మాయమైపోతాడు. అతను ఎక్కడకి వెళ్ళాడు? అతని జీవితం నేపథ్యంతో కాంతార-2 కథ ఉండబోతుందని సమాచారం. ఇక ఈ సీక్వెల్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను హీరోయిన్ గా కనిపించనున్నారు.