కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ 'కాంతార చాప్టర్1 ' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. బాలీవుడ్ చిత్రాలను సైతం బోల్తొ కొట్టిస్తూ దూసుకెళ్తోంది. థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. 'కాంతార'కు ప్రీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ.. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 675 కోట్లకు పైగా వసూళ్లును రాబట్టింది.
ఈ చిత్రం భారీ విజయాన్ని పురస్కరించుకుని మూవీ మేకర్స్ .. దీపావళి సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుకను అందించింది. లేటెస్ట్ గా కాంతార చాప్టర్ 1 నుంచి కొత్త ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలోని పలు కీలక సన్నివేశాలు, ఉత్కంఠభరితంతో కూడిన ఘాట్టాలతో కలిపి కొత్త ట్రైలర్ ను రూపొందించి.. విడుదల చేసింది. ఈ మూవీపై మరింత ఆసక్తిని పెంపొందించేలా .. ఆకట్టుకుంటోంది.
