
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ రామ్గోపాల్పేట కాపు సంఘం ఆధ్వర్యంలో 126 మంది మున్నూరు కాపు విద్యార్థులకు ఆదివారం స్కాలర్షిప్ అందజేశారు. స్థానిక కాపు సంఘం భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కు రూ.15 వేలు, బీటెక్ వారికి రూ.10 వేలు, డిగ్రీ స్టూడెంట్స్ కు రూ.8 వేలు, ఇంటర్ విద్యార్థులకు రూ.5 వేలు, స్కూల్ విద్యార్థులకు రూ.3 వేలు చొప్పున మొత్తం రూ.8.50 లక్షల విలువైన చెక్కులు అందించినట్లు జనరల్ సెక్రటరీ గున్నాల శ్రీనివాసరావు తెలిపారు. ప్రెసిడెంట్ హరిదాస్ కిషన్, ముఖ్య అతిథి సుధాం పాండు, కోశాధికారి అన్నం మనోజ్, ట్రస్టీ ప్రొఫెసర్ ఎంఆర్.వెంకట్రావు తదితరులున్నారు.