Karishma kapoor: నా భర్త నన్ను వేలం వేసి స్నేహితులతో.. నటి కరిష్మా షాకింగ్ కామెంట్స్

Karishma kapoor: నా భర్త నన్ను వేలం వేసి స్నేహితులతో.. నటి కరిష్మా షాకింగ్ కామెంట్స్

నా భర్త నన్ను వేలం వేశాడంటూ సంచలన కామెంట్స్ చేశారు బాలీవుడ్ బ్యూటీ కరిష్మా కపూర్(Karishma Kapoor). కొంత కాలం క్రిందివరకు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఆమె పెళ్లి తరువాత సినిమాలకు దూరం అయ్యారు. ఈ నేపధ్యంలో తాజాగా ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కపూర్స్ ఫ్యామిలీకి చెందిన నటి కరిష్మా కపూర్. ప్రేమ ఖైదీ సినిమాతో ఆమె హీరోయిన్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆతరువాత బాలీవుడ్ లోని రెండో తరం స్టార్స్ అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఆ క్రమంలోనే 2003లో ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వాళ్ళ 2016లో విడిపోయారు ఈ జంట. అప్పటినుండి ఒంటరిగానే ఉంటున్నారు కరిష్మా.

అయితే తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె తన భర్త సంజయ్ కపూర్‌(Sanjay Kapoor) గురించి సంచలన కామెంట్స్ చేశారు. తన వైవాహిక జీవితం గురించి మాట్లాడిన ఆమె.. ఒక సందర్భంలో తన భర్త తనను వేలం వేశారని, హనీమూన్ సమయంలో తన ఫ్రెడ్స్ తో కూడా సన్నిహితంగా ఉండాలని బలవంతం చేశారని చెప్తూ ఎమోషనల్ అయ్యారు కరిష్మా. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.