బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..యువకుడు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..యువకుడు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకు పై వెళ్తున్న  ముగురు యువకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్మన్ ఘాట్ చౌరస్తా సమీపంలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు వెళ్తున్నారు. ఈ సమయంలో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  శివ (20)అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న  పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.