హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకు పై వెళ్తున్న ముగురు యువకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్మన్ ఘాట్ చౌరస్తా సమీపంలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు వెళ్తున్నారు. ఈ సమయంలో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివ (20)అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.