రోడ్లు బాగుండటం వల్లే యాక్సిడెంట్లు…

రోడ్లు బాగుండటం వల్లే యాక్సిడెంట్లు…

బెంగళూరు: రోడ్‌‌ యాక్సిడెంట్లపై కర్నాటక డిప్యూటీ సీఎం గోవింద్‌‌ కర్జోల్‌‌ కొత్త విషయం తెరపైకి తెచ్చారు. రోడ్లు బాగుండటం వల్లే యాక్సిడెంట్లు జరుగుతున్నాయని కొత్త థియరీ చెప్పారు. “ రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల దాదాపు పదివేల మంది చనిపోతున్నారు. రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని మీడియా చెప్తుంది. కానీ రోడ్లు బాగుండటం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. హైవేల పైనే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతాయి. ట్రాఫిక్‌‌ రూల్స్‌‌ పాటించని వారికి భారీగా జరిమానాలు వేయడానికి నేను వ్యతిరేకం.” అని గోవింద్‌‌ అన్నారు.