
- మార్చ్, ఈవెంట్లకు పర్మిషన్తప్పనిసరి చేసిన ప్రభుత్వం
- ఆ సంస్థ కార్యకలాపాలపై ప్రియాంక్ ఖర్గే లేఖలతో చర్యలు
బెంగళూరు: ఆరెస్సెస్ యాక్టివిటీస్ ను నియంత్రించేందుకు కొత్త నిబంధనలు తీసురావాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. స్కూళ్లు, పబ్లిక్ ప్లేసులు, గవర్నమెంట్ ప్రాంగణాల్లో ఆ సంస్థ మార్చ్, ఈవెంట్స్ నిర్వహించాలంటే తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆరెస్సెస్ లేదా మరే సంస్థ అయినా డిస్ట్రబెన్స్ కలిగించే కార్యకలాపాలకు పాల్పడితే నియంత్రిస్తామని తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం ఆరెస్సెస్ యాక్టివిటీస్పై తెచ్చిన నిబంధనలు పరిశీలించి, వాటిని అనుసరించాలని కర్నాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలినీ రజనీశ్కు ఆదేశాలు జారీ చేశారు. ఆరెస్సెస్ యాక్టివిటీస్పై ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. ఎన్ని బెదిరింపులు వచ్చినా యువతను తీవ్రవాదం నుంచి రక్షిస్తామని ప్రియాంక్ అన్నారు.
ప్రియాంక్కు బెదిరింపులు
ఆరెస్సెస్ శాఖలు ప్రభుత్వ బడులు, పబ్లిక్ గ్రౌండ్స్లో నడుస్తున్నాయని, అవి యువత మనస్సుల్లో విషం నింపుతున్నాయని, ఇది దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నదని కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే అక్టోబర్4న సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. తమిళనాడులో అమలు చేస్తున్నట్టుగా ఆర్ఎస్ఎస్ క్యాకలాపాలను నియంత్రించాలని అందులో కోరారు.