కన్నీళ్లు పెట్టుకుంటూ కర్నాటక మంత్రి నాగేంద్ర రాజీనామా 

కన్నీళ్లు పెట్టుకుంటూ కర్నాటక మంత్రి నాగేంద్ర రాజీనామా 

బెంగళూరు: మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి సంస్థలో చోటుచేసుకున్న రూ.89 కోట్ల కుంభకోణం వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రణాళిక- గణాంకాల శాఖ మంత్రి బి.నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో రాజీనామాను ప్రకటిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకోవడం ఇది రెండోసారి.

గతంలో సిద్ధరామయ్య కేబినెట్‎లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన నాగేంద్ర.. 2024 మేలో కార్పొరేషన్ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రశేఖరన్ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన నిధుల అక్రమ బదిలీల కేసులో 2024 జూన్‌‌‌‌‌‌‌‌లో తొలిసారి రాజీనామా చేశారు. ఆ తర్వాత డీకే శివకుమార్ సీఎంగా పగ్గాలు చేపట్టాక, ఆగస్టు 3న నాగేంద్ర తిరిగి కేబినెట్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చారు. ఆయన రీ-ఇండక్షన్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో నాగేంద్ర రాజీనామా చేశారు.