కార్తీక పౌర్ణమి శోభతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

కార్తీక పౌర్ణమి శోభతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

అమరావతిలో కార్తీక పౌర్ణమి శోభతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలోని శైవ క్షేత్రాలు.. శివనామ స్మరణలతో మార్మోగుతున్నాయి.  ఆలయాలకు పెద్దఎత్తున మహిళా భక్తులు తరలివస్తున్నారు.. పిండి, ఉసిరి ద్వీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు మహిళలు.. ద్వీప కాంతులతో కళ కళలాడిన ఆలయ ప్రాంగణాలు. అజ్ఞానాన్ని తోలగించి జ్ఞానాన్ని ప్రసాదించాలంటూ పూజలు చేస్తున్నారు. పరమశివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు.