అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో చిత్రాన్ని 'షెహజాదా' టైటిల్తో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ హీరోహీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇవాళ హీరో కార్తీక్ ఆర్యన్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు.
59 సెకన్లు ఉన్న చిత్ర టీజర్ అందరినీ ఆకట్టకునేలా ఉంది. అయితే సినిమాలో యాక్షన్ సీన్స్ మాత్రం కొత్తగా ఏమీ లేవు. ఒరిజినల్ నుంచి మక్కికి మక్కిగా దించినట్టుగా కనిపిస్తోంది. హీరోయిన్ కృతి సనన్ టీజర్ లో చాలా గ్లామర్ గా కనిపిస్తు్ంది. మనీషా కోయిరాలా, పరేష్ రావల్, రోనిత్ రాయ్, సచిన్ ఖేడేకర్ కీరోల్ ప్లే చేస్తున్న ఈ మూవీని ఫిబ్రవరి 10, 2023న విడుదల చేయనున్నారు. లుకా చుప్పి తరువాత కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ నటిస్తోన్న రెండో మూవీ ఇది.