తమిళ స్టార్ హీరో సూర్య, సౌత్ స్టార్ క్వీన్ త్రిష జంటగా నటించిన తమిళ చిత్రం ‘కరుప్పు’ ఓటీటీలోకి వచ్చేసింది. డైరెక్టర్ కం యాక్టర్ ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలైంది. వరుస పరాజయాల తర్వాత ఈ సినిమాతో సూర్య బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాడు.
గత నెల మే 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్బస్టర్గా నిలిచింది. సూర్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన కరుప్పు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.
God Mode Begins 🔥#KaruppuOnPrime, #VeerabhadruduOnPrime, Watch Now pic.twitter.com/7zSg85d2lU
— prime video IN (@PrimeVideoIN) June 12, 2026
కథేంటంటే?
తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు (ఇంద్రన్స్) తన కూతురి ఆపరేషన్ కోసం హైదరాబాద్ వస్తాడు. కానీ దురదృష్టవశాత్తూ సిటీకి రాగానే కొందరు దొంగలు వారి దగ్గరున్న నగలను దొంగిలిస్తారు. పోలీసులు దొంగలను పట్టుకున్నప్పటికీ, ఆ నగలను తిరిగి పొందాలంటే నాంపల్లి కోర్టు చుట్టూ తిరగాల్సిందేనని చెబుతారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లిన ఆ తండ్రీకూతుళ్లకు బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) అనే ఒక అవినీతి లాయర్ తారసపడతాడు.
సహాయం చేయాల్సింది పోయి, వారిని మరింత ఇబ్బందుల్లోకి నెడతాడు. పోలీస్, లీగల్ సిస్టమ్లోని అవినీతి పరాకాష్టకు చేరిన తరుణంలో.. ఆ దుర్మార్గులకి బుద్ధి చెప్పడానికి, బాధితులకు న్యాయం చేయడానికి సాక్షాత్తూ ఆ 'కరుప్పు' (వీరభద్రుడు) దేవుడు మనుష్య రూపంలో లాయర్ శరవణన్ (సూర్య) గా వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే అసలు కథ!
థియేటర్ రెస్పాన్స్..
న్యాయవ్యవస్థలోని అవినీతిని అంతం చేసే ఒక పవర్ఫుల్ లాయర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే ఆ లాయర్ ఎవరో కాదు.. సాక్షాత్తూ కలియుగ కాపలా దైవం 'కరుప్పుసామి' మానవరూపం. మంచికి (సూర్య), చెడుకి (ఆర్జే బాలాజీ) మధ్య జరిగే ఈ మోడ్రన్ మైథలాజికల్ వార్ ఆడియెన్స్కు గూస్బంప్స్ తెప్పించింది. చాలా కాలం తర్వాత సూర్య, త్రిషల కాంబినేషన్ స్క్రీన్పై మ్యాజిక్ చేయగా.. సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లను ఊపేసింది. ఆర్జే బాలాజీ విలనిజం సినిమాకే హైలైట్గా నిలిచింది.
