
లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేసిన కవితను రేపు ( మార్చి 16) న ఢిల్లీ రౌస్ అవెస్యూ కోర్టులో 11 గంటలకు హాజరుపర్చనున్నారు. ఈ రోజు ( మార్చి 15)సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. రేపు ( మార్చి 16) కవిత సుప్రీం కోర్టులో ఛాలెంజ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. కవితతో భర్త అనిల్ ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి 10.30 గంటల ఫ్లైట్ కు మరికొంత మంది కుటుంబసభ్యులు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం ఉంది. మనీ లాండరింగ్ కింద సెక్షన్లపై ఈడీ కేసు నమోదు చేసింది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే అరెస్ట్ చేశారని కవిత ఆరోపించారు. న్యాయపరంగా ఎదుర్కొంటామని కవిత తెలిపింది.