హైదరాబాద్​ చేరుకున్న కవిత.. స్వాగతం పలికేందుకు రాని గులాబీ శ్రేణులు

హైదరాబాద్​ చేరుకున్న కవిత.. స్వాగతం పలికేందుకు రాని గులాబీ శ్రేణులు

అమెరికా టూర్​ ముగించుకొని బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత శంషాబాద్​ ఎయిర్​ పోర్టుకు చేరుకున్నారు.  నిన్న ( మే 22) మైడియర్​ డాడీ అంటూ కవిత రాసిన లేఖ బీఆర్ఎస్​లో చిచ్చు రేపింది.  ఎప్పుడూ కవితకు అండగా ఉండే బీఆర్​ఎస్​ నాయకులు ... ఆమెకు స్వాగతం పలికేందుకు ఎయిర్​పోర్టుకు వెళ్లలేదు. కేసీఆర్​ కు రాసిన లెటర్​ పై కవిత స్పందన ఎలా ఉంటుందోనని  రాజకీయ వర్గాల్లో ఆశక్తికర చర్చ సాగుతోంది

తెలంగాణ జాగృతి కార్యకర్తలతో ఎయిర్​ పోర్ట్​ నిండిపోయింది.  కవితకు స్వాగతం పలికేందుకు కొత్త బ్యానర్లు కనపడ్డాయి.   పార్టీ పేరు లేకుండా .. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవితకు స్వాగతమంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.  కవిత నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేవారు,  బ్యానర్లుఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల్లో ఎక్కడ కేసీఆర్​..కేటీఆర్​.. హరీశ్​రావుల ఫొటోలు కనపడలేదు.   కవితకు స్వాగతంచెప్పేందుకు వచ్చిన కార్యకర్తలు నీలి రంగు, లేత ఆకుపచ్చ కండువాలతో  జాగృతి కార్యకర్తలు వచ్చారు .  టీమ్​ కవితక్క అంటూ అభిమానులు కటౌట్లు ప్రదర్శించారు.