పూలే విగ్రహం కోసం మహాధర్నా చేస్తం : కవిత 

పూలే విగ్రహం కోసం మహాధర్నా చేస్తం : కవిత 
  • సర్కారు ఏప్రిల్ 11లోగా నిర్ణయం తీసుకోవాలె

హైదరాబాద్, వెలుగు :  అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ త్వరలోనే మహాధర్నా చేస్తా మని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. శుక్రవారం హైదరాబాద్​లోని ఒక  ఫంక్షన్​హాల్​లో నిర్వహించిన రౌండ్​ టేబుల్​సమావేశంలో ఆమె మాట్లాడారు. అసెం బ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటుకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు సర్కారుకు లేఖలు రాయాలని కోరారు.

ప్రతి జిల్లా, యూని వర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. మహాధర్నా నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. రౌండ్​టేబుల్​సమావేశంలో 9 అంశాలపై తీర్మానాలు చేశారు. ఏప్రిల్11లోగా విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం  సానుకూలంగా స్పందించాలని తీర్మానం చేశారు. పూలేకు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఓబీసీల కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, త్వరగా బీసీ జనగణన చేపట్టాలని, మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని, బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని తీర్మానాలు చేశారు.