కేటీఆర్‎కు ACB నోటీసులు ఇవ్వడంపై స్పందించిన కవిత.. ఏమన్నారంటే..?

కేటీఆర్‎కు ACB నోటీసులు ఇవ్వడంపై స్పందించిన కవిత.. ఏమన్నారంటే..?

హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‎కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయిన కవిత.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేటీఆర్‎కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ కేటీఆర్‎కు మళ్ళీ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. మీరు ఎన్ని కుట్రలు పన్నినా మీ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని పేర్కొన్నారు. 

కాగా, గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో అన్నాచెల్లెలు కేటీఆర్, కవిత మధ్య కోల్డ్ వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని పరోక్షంగా కేటీఆర్‎ను ఉద్దేశిస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపాయి. బీఆర్ఎస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి కోవర్టులు ఉన్నారంటూ కేటీఆర్ ఇన్ డైరెక్ట్‎గా కవితకు కౌంటర్ ఇచ్చారు. 

►ALSO READ | గుడ్ న్యూస్: ఈ నెలాఖరులోగా రైతుల అకౌంట్లోకి డబ్బులు

పార్టీలో కేసీఆర్ మాత్రమే తనకు నాయకుడిని కవిత.. ఎవరైనా సరే పార్టీ విషయాలను అంతర్గంగా చర్చించాలని కేటీఆర్ పరస్పరం కామెంట్లు చేసుకున్నారు. దీంతో అన్నాచెల్లెలకు చెడిందని.. త్వరలోనే కవిత బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చి సొంత దుకాణం పెడుతుందంటూ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 

కానీ గత  కొద్ది రోజులుగా కవిత సెలెంట్ అయ్యారు. కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరైన రోజు ఆమె ఎర్రవెల్లి ఫామ్ హౌస్‎కు వెళ్లి తండ్రికి మద్దతుగా నిలిచారు. తాజాగా కేటీఆర్‎కు ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ నోటీసులు ఇవ్వడాన్ని కవిత తీవ్రంగా ఖండించడంతో.. అన్నాచెల్లెల మధ్య ఇప్పటికైతే కోల్డ్ వార్ ఖతమైనట్లే కనిపిస్తోంది.