గుడ్ న్యూస్: ఈ నెలాఖరులోగా రైతుల అకౌంట్లోకి డబ్బులు

గుడ్ న్యూస్: ఈ నెలాఖరులోగా రైతుల అకౌంట్లోకి డబ్బులు

ఈ  నెలాఖరులోగా రైతు భరోసాను అర్హులందరికీ ఇస్తామని, నాట్లకు ముందే రైతులు ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జూన్ 13న ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సీజన్ కు సంబంధించి 21 వేల కోట్లు రైతు బంధు కింద ఇచ్చామన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త కాలర్ఎగరవేసుకునేలా చేస్తామన్నారు. కులగ ణన చేయగలిగిన దమ్ము, దైర్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే ఉందన్నారు.రాహుల్ గాంధీ ఆలోచ సలతో దేశ ప్రధాని మోడీ కులాగణన చేస్తామని ప్రకటించారని చెప్పారు. 

ALSO READ | గద్దర్ ఫిల్మ్ అవార్డులు అందుకోబోతున్న అందరికి అభినందనలు: CM రేవంత్

త్వరలోనే కర్ణాటకలో కులగణన జరుగుతుందన్నారు. ఏ ఒక్కరు పదవుల కోసం కంగారు పడకండి, అందరికీ పదవులు వచ్చే అవకాశం ఉంది. మీరు పదపు లలో కూర్చుంటే మీరు నాకు ఇచ్చిన స్థానానికి విలువ ఉంటుంది. నేను గెలిచిన తర్వాత రోజు విడిచి రోజు మీ మధ్యలో ఉంటున్న. నాకు మీరు ఇచ్చిన గౌరవం జన్మ జన్మలకు మర్చిపోను. మీ గ్రామాల్లో ప్రతి గ్రామానికి మంచి నీళ్లు ఇచ్చిన ఘనత నాదే. నా గెలుపు కోసం పని చేసిన మీరు పదవుల్లో కూర్చోవాలని నా ఆశ. మీ మండలం ఇప్పుడు బంగారపు తునక అయింది. ఇతరరా ష్ట్రాల వారు ఖమ్మం లో ఇల్లు కట్టుకోవాలి అను కుంటున్నారు. హైదరాబాద్ కు పోటీగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. పదవులు ఊరికే రావు కష్టపడే వారికే వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నిక ల్లో మీరు ఏ గ్రామానికి రమ్మంటే... ఆ గ్రామాని కి వస్త. మీరు ఐక్యంగా లేకుంటే మీ మధ్యలో బీఆర్ఎస్ వాళ్లు గొడవ పెట్టీ వాళ్లు ఎగేసుకుని పోతారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి పనుల్లో ఖమ్మంను ఆదర్శంగా తీర్చిదిద్దుతా. ' అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.