సుప్రీంకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత..

సుప్రీంకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసింది. పిటిషన్‌పై విచారణ అవసరం లేకపోవడంతో దానిని వెనక్కి తీసుకుంటున్నట్లు కవిత తరపు న్యాయవాది విక్రమ్‌ చౌదరి తెలిపారు. 

పిటిషన్‌ ఉపసంహరణకు జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం అనుమతించింది. చట్టప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలతకు వెళ్తామని చౌదరి తెలిపారు. మరో వైపు లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన కవిత నాలుగు రోజుల నుంచి ఈడీ కస్టడీలో కొనసాగుతుంది. ఇప్పటికి ఈ కేసులో ఈడీ అధికారులు 15 మందిని అరెస్టు చేశారు.