
ప్రదీప్ రంగనాథన్కు జంటగా ‘డ్రాగన్’ చిత్రంతో ఆకట్టుకున్న కయాదు లోహర్.. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇందులో హీరోయిన్గా పలువురు ప్రముఖ హీరోయిన్స్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ కయాదు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ తెరకెక్కిస్తున్న ‘ఫంకీ’ చిత్రంలోనూ ఆమె హీరోయిన్గా నటిస్తున్నట్టు సమాచారం.
అలాగే తమిళ హీరో శింబుకు జంటగా ఓ చిత్రంలో ఆమె నటిస్తోంది. అధర్వ, జీవీ ప్రకాష్ కుమార్ వంటి యంగ్ హీరోల సినిమాల్లోనూ ఆమెనే హీరోయిన్. ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాలతో ఫుల్ బిజీ అవుతోంది కయాదు లోహర్. నిజానికి తెలుగు ప్రేక్షకులకు ఆమె కొత్తేమీ కాదు. మూడేళ్ల క్రితమే శ్రీవిష్ణుకు జంటగా ‘అల్లూరి’ అనే చిత్రంలో నటించింది. కానీ అప్పట్లో అంతగా గుర్తింపును అందుకోలేదు. ఇప్పుడు ‘డ్రాగన్’ హిట్ అవడం, తన సోషల్ మీడియా వీడియోలకు యూత్ ఫిదా అవుతుండడంతో ఫాలోయింగ్తో పాటు అవకాశాలు కూడా పెరిగాయి.