తెలంగాణను దొరల పాలన నుంచి విముక్తి కలిగించండి: వివేక్ వెంకటస్వామి

తెలంగాణను దొరల పాలన నుంచి విముక్తి కలిగించండి: వివేక్ వెంకటస్వామి

తెలంగాణను దొరల పాలన నుంచి విముక్తి కలిగించాలన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి.  కేంద్రం గృహనిర్మాణాల కోసం మంజూరు చేసే నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని.. తానే 3 లక్షల రూపాయిలు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ మోసంచేస్తున్నాడన్నారు. కేసీఆర్ సీఎం అయిన తరువాత బాగా ఆస్తులు కూడబెట్టారన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానని..పదవులు తీసుకోనన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు సీఎం పదవి కోసం వెంపర్లాడుతున్నాడని దుయ్యబట్టారు వివేక్ వెంకటస్వామి.  కల్వకుంట్ల కుటుంబం నెలకు 50 లక్షల రూపాయిల ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ దగా  చేస్తుందన్నారు.   

తన ఫామ్ హౌస్ కు  నీళ్లు తీసుకెళ్లేందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కేసీఆర్ నిర్మించారన్న వివేవ్ వెంకట స్వామి.. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో చెన్నూరు నియోజకర్గంలోని పంటలు ముంపునకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నా.. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పట్టించుకోకుండా.. అవినితీ అక్రమాలు చేస్తున్నాడన్నారు. తెలంగాణను దొరల పాలన నుంచి విముక్తి కలిగించేందుకు బీజేపీకి పట్టం కట్టాలని వివేక్ వెంకటస్వామి ప్రజలను కోరారు.