కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్

కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్

మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. బుధవారం (జూన్ 11) 11.30 గంటలకు విచారణ ఉన్నందున ఆయన 11 గంటలకే BRK భవన్ కు చేరుకున్నారు. బీఆర్ కే భవన్ లోకి కేసీఆర్ తో పాటు 9 మందిని అనుమతించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ ను విచారించనుంది. 

కేసీఆర్ విచారణకు హాజరవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున బీఆర్ కే భవన్ కు చేరుకున్నారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 200 మీటర్ల అవతల బారికేడ్లు ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు. 

కాళేశ్వరం కమిషన్ విచారణ దృష్ట్యా కేసీఆర్ ఇప్పటికే ప్రాజెక్టుపై అధ్యయనం చేశారు. అదే విధంగా అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుతో పలుమార్లు భేటీ అయ్యారు. ఇరిగేషన్ అధికారులతో కీలక ఆధారాలు సేకరించి విచారణకు సిద్ధమయ్యారు. బుధవారం షెడ్యూల్ ప్రకారం కమిషన్ ముందు హాజరయ్యారు.