
కోల్బెల్ట్: రాష్ట్రంలో 20 లక్షలమందికి ప్రభుత్వం కొత్త రేషన్కార్డులను అందజేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి అన్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లా చెన్నూరులోని 677 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, 526 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేండ్ల బీఆర్ఎస్పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు.
కమీషనర్ల కోసం మాత్రం కేసీఆర్కాళేశ్వరం కట్టించారన్నారు. ‘ కేసీఆర్ సర్కార్ రాష్ట్రాన్ని దివాలా తీసింది. లక్ష కోట్ల తో ప్రాజెక్టును నిర్మించి కమిషన్లు దండుకున్నారు. ఆ పైసలతో రాష్ట్రంలోని అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించే అవకాశం ఉండేది. డబుల్బెడ్రూమ్ఇండ్ల ఇస్తామని పదేండ్లు ప్రజలను మోసం చేశారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం.
అర్హులందరికీ ఇండ్లను అందిస్తాం. ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు ఊహించని విధంగా పేదల కోసం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది.’ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి అన్నారు.