పదేండ్లలో ఒక్క రేషన్​కార్డు కూడా ఇవ్వలె.. కమీషన్ల కోసం మాత్రం ​కాళేశ్వరం కట్టిండు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి

 పదేండ్లలో ఒక్క రేషన్​కార్డు కూడా ఇవ్వలె..  కమీషన్ల కోసం మాత్రం ​కాళేశ్వరం కట్టిండు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి

కోల్​బెల్ట్:  రాష్ట్రంలో 20 లక్షలమందికి ప్రభుత్వం కొత్త రేషన్​కార్డులను అందజేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి అన్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లా చెన్నూరులోని 677 మంది లబ్ధిదారులకు నూతన రేషన్  కార్డులు, 526 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేండ్ల బీఆర్ఎస్​పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు.  

కమీషనర్ల కోసం మాత్రం కేసీఆర్​కాళేశ్వరం కట్టించారన్నారు. ‘  కేసీఆర్  సర్కార్ రాష్ట్రాన్ని దివాలా తీసింది.   లక్ష కోట్ల తో ప్రాజెక్టును నిర్మించి కమిషన్లు దండుకున్నారు. ఆ పైసలతో రాష్ట్రంలోని అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు  కట్టించే అవకాశం ఉండేది.  డబుల్​బెడ్​రూమ్​ఇండ్ల ఇస్తామని పదేండ్లు ప్రజలను మోసం చేశారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం.  

అర్హులందరికీ ఇండ్లను అందిస్తాం. ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు ఊహించని విధంగా పేదల కోసం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది.’ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి అన్నారు.