రాష్ట్రానికి ఏమీ చేయలేదు..దేశానికి ఏం చేస్తారు ?: నిర్మలా సీతారామన్

రాష్ట్రానికి ఏమీ చేయలేదు..దేశానికి ఏం చేస్తారు ?: నిర్మలా సీతారామన్

రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు : నిర్మల

తెలంగాణ రాష్ట్రానికే ఏమీ చేయలేకపోయిన సీఎం కేసీఆర్.. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో దేశానికి ఏం చేస్తారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రశ్నించారు. తెలంగాణలో కొత్త రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంతో చుక్క నీరు రాలేదని, ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్షా 40వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇస్తామన్న కేసీఆర్ ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. 3 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశాడన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి తెలంగాణ ప్రజలపై భారాలు వేశారని ఆరోపించారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2018 వరకు మంత్రివర్గంలో మహిళలకు అవకాశం కల్పించలేదని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ మండిపడ్డారు. తెలుగు భాషతో పాటు తెలంగాణను మర్చిపోతున్న టీఆర్ఎస్ దేశానికి ఏం చేస్తుందని ప్రశ్నించారు.