
తొలి తరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరు చిరంజీవి కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంత బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆసత్పిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సీఎం కెసిఅర్ సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ గా ఉన్నత చదువులు చదివి సమాజం కోసం బతికిన చిరంజీవి జీవితం ఆదర్శనీయమన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.