35 లక్షల మంది యువత జీవితాలను కేసీఆర్ నాశనం చేశారు : కిషన్రెడ్డి

35 లక్షల మంది యువత జీవితాలను కేసీఆర్ నాశనం చేశారు : కిషన్రెడ్డి

35 లక్షల మంది యువత జీవితాలను కేసీఆర్ నాశం చేశారన కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తల్లిదండ్రుల వద్ద బంగారు అమ్మి, అప్పులు చేసి మరీ నగరంలో కోచింగ్ తీసుకొని, వీధిలైట్ల కింద, పార్కుల్లో చదువుకొని పరీక్షలు రాస్తే.. ప్రశ్నాపత్రాలు లీకై నిరుద్యోగ యువత బతుకులు ఆగమయ్యా యని అన్నారు. ఈ పాపం ఎవరిది అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

నిరుద్యోగుల భవిష్యత్ గురించి ఆలోచన లేని కేసీఆర్.. బీజేపీ నేత బండి సంజయ్ పోరాటం చేస్తే కేసులు పెట్టారని ఆరోపించారు. అవినీతి కుంభకోణాలు మీవి.. చేతకాని తనం మీది.. లీకేజీలు మీవీ.. మాపై కేసులు పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

డీఎస్పీ వేస్తాం.. 25 వేల టీచర్ పోస్టులు బర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్  హామీ ఇచ్చారు. 25వేలు టీచర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి కదా.. ఎందుకు భర్తీ చేయడం లేదు అన్ని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గత తొమ్మిదేండ్లుగా డీఎస్సీ వేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఉద్యో్గాలు ఇస్తాం.. ఇవ్వకుంటే నిరుద్యోగులకు రూ. 3016 భృతి ఇస్తామని అని చెప్పి మోసం చేశారని కిషన్ రెడ్డి అన్నారు.

ఉద్యోగాల ఆశచూపి.. ఇవ్వకుండా కేసీఆర్ నిరుద్యోగులకు మోసం చేశారని.. ఏ మొహం పెట్టుకొని గ్రామాల్లో ఓట్లు అడిగేందుకు వస్తారని కిషన్ రెడ్డి అన్నారు. హామీలు ఇవ్వడం.. అవి నెరవేరచకుండా మోసం చేయడమే కేసీఆర్ నైజం అన్ని కిషన్ రెడ్డి తెలిపారు.