కంటి వెలుగు ప్రారంభించిన పంజాబ్ సీఎం మాన్

కంటి వెలుగు ప్రారంభించిన పంజాబ్ సీఎం మాన్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2 విడత కార్యక్రమం ప్రారంభమైంది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చేతుల మీదుగా కంటి వెలుగు ప్రోగ్రాంను ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. సీపీఐ నేత రాజాలకు స్కీం గురించి వివరించారు. కంటి పరీక్ష చేసే విధానాన్ని ప్రత్యక్షంగా చూపారు. 

అంతకు ముందు ఖమ్మం కొత్త కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కేరళ సీఎం పినరయి విజయన్ కలెక్టరేట్ భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బిల్డింగ్ రిబ్బన్ కట్ చేశారు. కలెక్టర్ గౌతమ్ ను సీట్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం అతిథులుగా వచ్చిన నేతలందరికీ కలెక్టర్ కార్యాలయాన్ని చూపించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు.