కాంగ్రెస్‌తో పొత్తుకు కేసీఆర్ తహతహలాడుతున్నారు

కాంగ్రెస్‌తో పొత్తుకు కేసీఆర్ తహతహలాడుతున్నారు

బీజేపీ బలపడుతుంటే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడు : విజయశాంతి

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటమ తప్పదని గ్రహించే ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ తో పొత్తుకు తహతహలాడుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకు  బలపడుతోందని, అది తట్టుకోలేక కేసీఆర్ బీజేపిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అధికారాన్ని నిలబెట్టకోవడం కోసమే కేసీఆర్ రాహుల్ గాంధీపై సానుభూతి చూపించారని విమర్శించారు. రాహుల్ గాంధీపై అస్సాం సీఎం కామెంట్స్ విషయంలో కాంగ్రెస్ లీడర్ల కంటే ముందే కేసీఆర్ స్పందించి సానుభూతి ప్రకటించటం చూస్తే ... రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని అర్థమవుతోందని చెప్పారు. ఇలా రాహుల్ గాంధీపై అకస్మాత్తుగా ప్రేమ రావడం అధికారదాహమే తప్ప మరొకటి కాదన్నారు. భైంసాలో హిందువులపై దాడులు జరిగితే మాట్లాడని కేసీఆర్... మతరాజకీయాల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ హిందువులను కించపరిచేలా మాట్లాడినప్పుడ కేసీఆర్  కళ్లల్లో నీళ్లెందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోడీపై సోనియా గాంధీ, చంద్రబాబు, ఇతర ప్రతిపక్షాల నాయకులు కామెంట్స్ చేసినప్పుడు కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదన్నారు.

మరిన్ని వార్తల కోసం..

పీకే లాంటి వాళ్ళు ఎందరొచ్చినా టీఆర్ఎస్ ను కాపాడలేరు

నూతన విద్యుత్ సంస్కరణలు ఉపసంహరించుకోవాలి