కేసీఆర్ చుట్టూ మొత్తం దొంగలే ఉన్నారు
శ్రీనివాస్ యాదవ్ ను మంత్రి చేశారు
కేసీఆర్ అనే గాడిదను దారిలో పెట్టాలి
కేసీఆర్ అసలు నైజం ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. తనకు ముందే తెలుసని..అందుకే ముందు నుంచే కేసీఆర్ పై పోరాటం చేస్తున్నానని తెలిపారు. తెలంగాణ ఉద్యమ కారులను ఒక్కరిని దూరం పెట్టారని ఆరోపించారు. తెలంగాణ పై విషం కక్కిన వాళ్లే ఇప్పుడు కుర్చీలో కూర్చుకున్నారన్నారు. తెలంగాన ఉద్యమం లో కీలకంగా పని చేసిన వివేక్ వెంకట స్వామి, జితేందర్ రెడ్డిలకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం చేస్తున్న విద్యార్ధులను గల్లీల వెంట ఉరికించి కొట్టిన శ్రీనివాస్ యాదవ్ ను మంత్రి చేశారన్నారు. ప్రస్తుతం కేసీఆర్ చుట్టూ ఉద్యమకారులు లేరు..మొత్తం దొంగలే ఉన్నారన్నారు. తెలంగాణ సెంటిమెంట్ అనే ముసుగును కప్పుకుని కేసీఆర్ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటిమెంట్ అనే బొంత ను గుత్ప పట్టుకొని ఊడ కొట్టాలన్నారు. కేసీఆర్ అనే గాడిదను దారిలో పెట్టాలన్నారు రేవంత్.
అంతేకాదు కేసీఆర్ శకాన్ని రాయలనుకుంటున్నాడు… భవిష్యత్ తరాలకు తానే గొప్పలా చెబుకోబోతున్నాడు…ఇది చాలా ప్రమాదంమన్న రేవంత్ రెడ్డి…కేసీఆర్ దించితే తప్పితే తప్ప తెలంగాణ కు పట్టిన శని వదలదన్నారు. ప్రతిపక్షం ఉండాలని ఎప్పటినుంచో చెప్పుకుంటూ వస్తున్నాన్నారు రేవంత్. ప్రతిపక్ష పార్టీలు ఉంటే ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నారు. చిన్న చిన్న తాయిలాల కోసం జర్నలిస్టులు కూడా లొంగారన్నారు. ఆరేళ్లుగా ప్రతి నిమిషం.. ప్రతిక్షణం వంచన చేస్తూ కేసీఆర్ వచ్చారన్నారు రేవంత్ రెడ్డి.