కేసీఆర్ మాయమాటలు చెప్పి రైతుల ఓట్లతో గెలిచారు: జగ్గారెడ్డి

కేసీఆర్ మాయమాటలు చెప్పి రైతుల ఓట్లతో గెలిచారు: జగ్గారెడ్డి

సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. తాము 24 గంటలు ప్రజలతో కలిసి…ప్రజల కోసం పనిచేస్తున్నా… ఎన్నికల్లో ఓడిపోతున్నామని చెప్పారు. దీనికి కారణం ఎన్నికలకు ముందు రైతుల కోసం కేసీఆర్ తీసుకొచ్చే పథకాలే కారణమన్నారు. మాయమాటలు చెప్పి రైతుల ఓట్లు వేయించుకుని కేసీఆర్ గెలిచారని చెప్పారు. ఎన్నికల్లో ముక్కూమొహం తెలియని టీఆర్ఎస్ నేతలు కూడా గెలిచారని ఆరోపించారు. రాష్ట్రంలో కౌలు రైతులకు ఎలాంటి ప్రోత్సాహం లేదని విమర్శించారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలో ఐదో స్థానంలో తెలంగాణ ఉందన్నారు. అంతేకాదు కరోనాను కట్టడి చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు జగ్గారెడ్డి.