ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చని కేసీఆరే అన్నారు: రావుల

ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చని కేసీఆరే అన్నారు: రావుల

గుర్తు లేకపోతే కేటీఆర్ కు సీడీలు పంపుతాం

హైదరాబాద్ , వెలుగు: ఎన్నికల టైంలో ఈవీఎంలను ట్యాంపర్ చేయడం పెద్ద విషయం కాదంటూ గతంలో కేసీఆర్ అన్నారని, ఆవిషయం కేటీఆర్ కు గుర్తు లేకపోతే ఆ సీడీలనుపంపిస్తామని టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి సోమవారం అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నారు కాబట్టే చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్ డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ విమర్శించడం సరికాదన్నారు. జగన్ తో బాబును పోల్చడం చాలా తప్పన్నారు. ఏపీలో టీడీపీదే విజయమని, బాబే సీఎం అవుతారని అన్నారు. 2014 ఎన్నికలప్పుడూ ఏపీలో జగన్ గెలుస్తారంటూ కేసీఆర్ చెప్పారని, కానీ జరగలేదని గుర్తు చేశారు. పార్టీలతో చర్చించకుండా రెవెన్యూ, మున్సిపల్ చట్టాలను ఎలా మారుస్తారని ప్రశ్నిం చారు. ప్రజల పక్షాన మాట్లాడే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి అధికార పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు.