ఎమ్మెల్యే లాస్య నందిత పార్థివదేహానికి కేసీఆర్ నివాళి..

ఎమ్మెల్యే లాస్య నందిత పార్థివదేహానికి కేసీఆర్ నివాళి..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పార్ధివదేహానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం కార్ఖానా గృహలక్ష్మి కాలనీలోని ఆమె నివాసానికి భౌతికకాయాన్ని ఉంచారు. ఈ క్రమంలో తమ అభిమాన ఎమ్మెల్యేను చివరిచూపు చేసేందుకు భారీగా కార్యకర్తలు తరలివస్తున్నారు. కేసీఆర్ లాస్య నివాసానికి చేరుకుని..ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి... ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లాస్య అంత్యక్రియలకు అన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. 

ఈరోజు సాయంత్రం 4 గంటలకు అంతిమయాత్రగా బయలుదేరి ఈస్ట్ మారేడ్ పల్లి స్మశానవాటికలో ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు కుటుంబ సభ్యులు.