
ధర నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా తీసుకువస్తున్న ధరణి పోర్టల్పై సీఎం కేసీఆర్ రేపు(మంగళవారం) సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్ రూపకల్పనపై మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ పోర్టల్ రూపకల్పనకు సమగ్ర సమాచారంతో రావాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ధరణి పోర్టల్ రూపకల్పన జరగాలని తెలిపారు.