- సహనం, అహింసా మార్గంఆదర్శనీయం: సీఎం కేసీఆర్
హైదరాబాద్ , వెలుగు:మహాత్మాగాంధీ చూపిన అహింస,సత్యాగ్రహం స్ఫూర్తితో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించుకున్నామని సీఎం కేసీఆర్అన్నారు. 2009 నవంబర్ 29 నుం చిడిసెంబర్ 9 వరకు తాను చేసిన నిరాహార దీక్ష సమయంలో ప్రజలు చూపించిన సహనం, అహింసామార్గం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందన్నారు. తననిరాహార దీక్షపై సీఎం పీఆర్వో గటికవిజయ్ కుమార్ రాసిన జ్వలిత దీక్షసెకండ్ ఎడిషన్ ను సీఎంమంగళవారం ప్రగతి భవన్ లోఆవిష్కరించారు. తాను దీక్షచేసినప్పుడు కరీంనగర్ , వరంగల్,ఖమ్మం , హైదరాబాద్ నగరాల్లో
నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న భావోద్వేగా లనుజ్వలితదీక్షలో గొప్పగా అక్షరీకరించారని ప్రశంసించారు. ఈసందర్భంగా ప్రొఫెసర్ అడపాసత్యనారాయణ రాసిన తెలంగాణలో గాంధీ, మహాత్మాగాంధీ ఇన్ తెలంగాణ పుస్తకాలను కేసీఆర్ ఆవిష్కరిం చారు.