కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మన బాధ కేసీఆర్కు తెలుస్తుంది

కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మన బాధ కేసీఆర్కు తెలుస్తుంది
  • క్రైసిస్ లోనే లీడర్లు ఎదుగుతారు
  • పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

హైదరాబాద్: పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో.. ఆ బాధ  కేసీఆర్కు తెలిసేలా చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మన బాధ కేసీఆర్కు తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. గాంధీభవన్ లో ఎన్ఎస్యూఐ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైసిస్ లోనే లీడర్లు ఎదుగుతారని గుర్తు చేశారు. చిన్నన్న ఎన్నికలలో పోటీ చేసినపుడు నేనే వాల్ రైటింగ్ చేశానని.. 2004 వరకు వనపర్తి ఎన్నికలలో చిన్నన్న కోసం పని చేశానని వివరించారు. నేను ఈ రోజు పీసీసీ అధ్యక్షుడిని అయ్యా..  ఆయన నా దగ్గర కూర్చున్నారంటూ.. చిన్నన్న  పనితనం చూసి నేర్చుకోవాలని సూచించారు. 

క్రైసిస్ లోనే లీడర్లు ఎదుగుతారని వివరిస్తూ.. 2009లోనే మణిక్కమ్ ఠాగూర్ వైగో లాంటి పెద్ద ఉద్యమకారుడిని ఓడించారని చెప్పారు. విద్యార్థి స్థాయిలోనే ఉద్యమాలు చేసే వారికి రాజకీయాలలో మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. నేను పీసీసీ అధ్యక్షులుగా మొదటి బ్.ఫామ్ వెంకట్ కు ఇచ్చానని తెలిపారు. విద్యార్థి ఉద్యమాలలో కీలకంగా ఉన్న నాయకులు భవిష్యత్తులో ఎదుగుతారని.. కాలేజీల స్థాయిలో కమిటీలు వేసుకోవాలి.. అప్పుడే సంస్థలు బలపడతాయన్నారు. విద్యార్థి ఉద్యమకారులను తాను తప్పక మద్దతు ఇస్తానన్నారు. మెరిట్ కే కోటా ఉంటుందని.. మీరు పని చేస్తే టికెట్స్ ఇంటికి వస్తాయన్నారు. సిరిసిల్ల సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.