హైదరాబాద్, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్టు వర్క్సైట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పనులను పర్యవేక్షించాలని గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)ను ఎన్జీటీ చెన్నై బెంచ్ ఆదేశించింది. సిద్దిపేట జిల్లాకు చెందిన బద్దం భాస్కర్రెడ్డి తదితరులు దాఖ లు చేసిన పిటిషన్ను ఆగస్టు 28న ఎన్జీటీ చెన్నై బెంచ్ జ్యూడీషియల్ మెంబర్ జస్టిస్ పుష్ప సత్యనారాయణ, ఎక్స్పర్ట్ మెంబర్ సత్య గోపాల్విచారించారు. విచారణ సందర్భంగా జారీ చేసిన ఆదేశాలతో కూడి న సర్టిఫైడ్ కాపీని మంగళవారం రిలీజ్ చేశారు.
గౌరవెల్లి నుంచి 1.41 టీఎంసీలు తీసుకునేందుకు అనుమతులు ఉండగా దాన్ని 8.23 టీఎంసీ లకు పెంచారని, ఇందుకు ఎలాంటి అను మతులు తీసుకో లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పెంచడంతో అదనంగా 2 వేల హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్అడ్వొకేట్జనరల్ప్రాజెక్టు పనులు 85 శాతం పూర్తయ్యాయని తెలిపారు.. ఆయా పనులకు సంబంధించిన ప్రొటెక్షన్వర్క్స్ మాత్రమే చేస్తున్నామని తమ ఎదుట ఒప్పుకున్నారని తెలిపారు.
అయితే అన్ని అనుమతులు తీసుకునే వరకు ప్రాజెక్టు పనులు చేయొద్దన్న తమ ఆదేశా లను ఇది ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తమ ఆదేశాలను ఇకపై ఉల్లంఘిం చకుండా ప్రాజెక్టు వర్క్సైట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని జీఆర్ఎంబీని ఆదేశించారు.