- కాళ్లు, చూపు లేనోళ్లు, బైపాస్చేయించుకున్నోళ్లూ ఉద్యోగం చేయాలట: హరీశ్రావు
- వెంటనే మెడికల్బోర్డు పెట్టిడిపెండెంట్ఉద్యోగాలివ్వాలి..లేదంటే భట్టి ఇంటిని ముట్టడిస్తం
- రిపోర్టర్లు, డెస్క్జర్నలిస్టులందరికీఒకే రకమైన కార్డులివ్వాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికులపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. కాళ్లు లేనివాళ్లను, కండ్లు కనిపించని వాళ్లను, గుండెకు బైపాస్ సర్జరీ చేసినోళ్లనూ ఉద్యోగం చెయ్యాలంటూ ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదని, కార్మిక కంటక ప్రభుత్వమని మండిపడ్డారు. కార్మికులను గోస పెడుతున్నదన్నారు. నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు, అలియాస్ పేర్లను పరిశీలిస్తామంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, ఈ రెండేండ్లలో కేవలం రెండుసార్లే మెడికల్ బోర్డు పెట్టారని మండిపడ్డారు. వెంటనే మెడికల్బోర్డును పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ఉద్యోగాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
శనివారం ఆయన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నేతలతో కలిసి సింగరేణి భవన్లో సంస్థ డైరెక్టర్గౌతమ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం సింగరేణి భవన్బయట మీడియాతో మాట్లాడారు. 40 వేల మంది సింగరేణి ఉద్యోగుల్లో 20 వేల మంది డిపెండెంట్ఉద్యోగులేనని చెప్పారు.
సింగరేణిని ప్రైవేట్పరం చేసేందుకు రేవంత్కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. విద్యుదుత్పత్తికి బొగ్గును తీసుకుని బిల్లులు చెల్లించడం లేదని, దీంతో సంస్థ అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రేవంత్ సీఎం అయ్యాక సింగరేణి సంస్థ రూ.50 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని హరీశ్ రావు ఆరోపించారు. ఆర్థికమంత్రిగా భట్టి విక్రమార్క సింగరేణి గొంతు కోస్తున్నారని, ఇది తగునా అని ప్రశ్నించారు. ‘‘నీ సోకుల కోసం, ఫుట్బాల్ కోసం సింగరేణి సంస్థకు చెందిన రూ.10 కోట్లను ఎట్లా ఖర్చు చేస్తవ్రేవంత్ రెడ్డి? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ వాడిన సొమ్ముపై ఎంక్వైరీ చేయించి.. దానికి కారణమైనోళ్లను బొక్కలో వేయిస్తం. భట్టి విక్రమార్క వెంటనే స్పందించి మెడికల్బోర్డు పెట్టాలి. కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. లేదంటే వారందరితో కలిసి భట్టి ఇంటిని ముట్టడిస్తం’’ అని హెచ్చరించారు.
డెస్క్ జర్నలిస్టులకూ అక్రెడిటేషన్లు ఇవ్వాలి
జర్నలిస్టుల్లో రిపోర్టింగ్, డెస్క్జర్నలిస్టులు అన్న తేడా లేకుండా అందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి తేడాలు చూపించకుండా అందరికీ అక్రెడిటేషన్లు ఇచ్చామన్నారు. కేసీఆర్ 26 వేల అక్రెడిటేషన్లు ఇస్తే.. దానిని రేవంత్ ప్రభుత్వం 10 వేలకు తగ్గించిందని మండిపడ్డారు. సోషల్ మీడియా, యూట్యూబ్ జర్నలిస్టులను టెర్రరిస్టులుగా పోల్చుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యం ఇస్తామని హామీ ఇచ్చి.. హక్కుల కోసం కొట్లాడుతున్న జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు.
జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి మద్దతిస్తామని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. రేవంత్ ప్రభుత్వంలో జర్నలిస్టులు సహా ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదన్నారు.
