- ఉమ్మడి జిల్లా టోర్నీ ఫైనల్స్లో మంచిర్యాలపై గెలుపు
కోల్బెల్ట్, వెలుగు: కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విన్నర్గా ఆదిలాబాద్ జట్టు నిలిచింది. మంచిర్యాల జిల్లా గుడిపేట 13 బెటాలియన్ పోలీస్ గ్రౌండ్స్లో విశాక ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్సీఏ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా టీ20 ఫేజ్-1 క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు.
శనివారం జరిగిన ఉమ్మడి జిల్లా ఫైనల్స్లో ఆదిలాబాద్ జిల్లా టీం, మంచిర్యాల టీంపై 70 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్గెలిచిన ఆదిలాబాద్ టీం మొదట బ్యాటింగ్కు దిగింది. 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. మహమ్మద్అస్పాన్ 47 బంతుల్లో 6 ఫోర్లు,2 సిక్స్లతో 68 పరుగులు చేశాడు. సాయిచరణ్ 22 పరుగులు చేశాడు.
మంచిర్యాల జిల్లా జట్టుకు చెందిన బౌలర్లు గణేశ్, ఇస్మాయిల్అహ్మద్, సందీప్ చేరో రెండేసి వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్దిగిన మంచిర్యాల జట్టు క్రీడాకారులు టార్గెట్ చేధించలేకపోయారు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో 13.2 ఓవర్లలో అలౌట్ అయ్యి 60 పరుగులు మాత్రమే చేశారు. ముగ్గురు డకౌట్కాగా నలుగురు కేవలం 8 లోపు పరుగులు చేయడంతో మంచిర్యాల జట్టుకు ఓటమి తప్పలేదు. 70 పరుగుల తేడాతో మెమోరియల్టీ20 క్రికెట్ టోర్నీ ఫేజ్ 1 విన్నర్గా ఆదిలాబాద్ జట్టు నిలిచింది. జట్టుకు చెందిన బౌలర్రాజబాబు నాలుగు ఓవర్లు వేసి తొమ్మిది రన్స్ఇచ్చి మూడు వికెట్లు తీయడంతో మ్యాన్ఆఫ్ది మ్యాచ్ దక్కించుకున్నాడు.
ఆటలకు కాకా ఫ్యామిలీ ప్రోత్సాహం..
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సాహించడంలో కాకా వెంకటస్వామి కుటుంబం ఎన్నో ఏండ్లుగా ముందుంటోందని మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్, జిల్లా ఒలింపిక్స్అసోసియేషన్ సెక్రటరీ పిన్నింటి రఘునాథ్రెడ్డి అన్నారు. ఫైనల్ పోటీల్లో గెలిచిన జట్టు ప్లేయర్లకు ఆయన బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ కాళీదాస్తో కలిసి బహుమతులు అందజేశారు. క్రికెట్ లీగ్ నిర్వహణలో 13 బెటాలియన్ కమాండెంట్, ఆఫీసర్లు, సిబ్బంది, హెచ్సీఏ భాగస్వాములయ్యారు.
కాకా మెమోరియల్ ట్రస్ట్, విశాక ఇండస్ర్టీస్ లిమిటెడ్ అధినేత, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు అతిథులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆదిలాబాద్ జట్టుకు విన్నర్, మంచిర్యాల జట్టుకు రన్నరప్ ట్రోఫీలను అందించారు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్న క్రీడాకారులకు రూ.2 వేల చొప్పున క్యాష్ ప్రైజ్లు అందజేశారు. కార్యక్రమంలో హెచ్సీఏ జిల్లా కోచ్ పొరండ్ల ప్రదీప్, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా ప్రెసిడెంట్ హఫీజ్, నాయకుడు నల్ల రవి, సీనియర్ క్రీడాకారులు చందు, శ్రీనివాస్, బెటాలియన్ ఆర్ఎస్ఐలు మహేశ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
