బాలీవుడ్లో కీర్తి సురేష్.. ఆ దర్శకుడి కోసమేనా?

బాలీవుడ్లో కీర్తి సురేష్.. ఆ దర్శకుడి కోసమేనా?

సౌత్ స్టార్  హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi suresh) బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందా? అనే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అది కూడా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్(Atlee kumar) సినిమాలో. ప్రస్తుతం ఈ ప్రెజెక్టు కు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దర్శకుడు అట్లీ కుమార్ ప్రస్తుతం షారుక్ ఖాన్(Shah rukh khan) తో జవాన్(Jawan) సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న థియేటర్స్ లోకి రానుంది. ఇక తాజాగా రిలీజైన జవాన్ సినిమా ట్రయిలర్(Jawan movie trailer) కు ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి.

అయితే తాజా సమాచారం మేరకు.. అట్లీ కుమార్ తన తరువాతి సినిమాను కూడా బాలీవుడ్ లోనే ప్లాన్ చేస్తున్నారట. వరుణ్ ధావన్(Varu dhavan) హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం మహానటి కీర్తి సురేష్ ను ఫిక్స్ చేశారట మేకర్స్. అయితే కీర్తి మాత్రం ఈ సినిమాను కేవలం దర్శకుడు అట్లీ కోసమే ఓకే చేశారనే కెమెంట్స్ వినిపిస్తున్నాయి. అట్లీ కుమార్ సినిమాలకు ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. ఈ దర్శకుడికి ఇప్పటివరకు ఒక్క ప్లాప్ కూడా లేదు. అందుకే అట్లీతో సినిమా చేసేందుకు.. స్టార్ హీరోస్ సైతం పోటీ పడతారు. అందుకే ఈ ఛాన్స్ వచ్చిన వెంటనే ఒకే చెప్పేసిందట కీర్తి సురేష్. ఇక అట్లీ, వరుణ్ ధావన్, కీర్తి కాంబోలో రానున్న ఈ మూవీకి ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ఇవ్వనున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే