
ఇటీవల ‘నాయకుడు’ సినిమాతో ఆకట్టుకున్న కీర్తి సురేష్... త్వరలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో ‘భోళా శంకర్’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరో మూడు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె.. తాజాగా ఓ యాక్షన్ థ్రిల్లర్కి కమిట్ అయింది. సుల్తాన్, ఖైదీ, ఖాకీ లాంటి సూపర్ హిట్ మూవీస్ తీసిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ దీన్ని నిర్మిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ సినిమాకు గణేష్ రాజ్ దర్శకుడు.
శనివారం పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు. హీరోయిన్ కీర్తి సురేష్తో పాటు నిర్మాతలు ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు, దర్శకుడు గణేష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇదొక ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ. ఎక్సైట్ చేసే స్క్రీన్ప్లే, ఆసక్తికరమైన ట్విస్టులతో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ను ఇస్తుందని, కీర్తి సురేష్ సరికొత్త పాత్రలో కనిపించనుందని మేకర్స్ చెబుతున్నారు.