ఎట్టకేలకు రాజ్యసభకు కేజ్రీవాల్.. ఆ ఎంపీ రాజీనామాతో పెద్దల సభలోకి ఆప్ చీఫ్

ఎట్టకేలకు రాజ్యసభకు కేజ్రీవాల్.. ఆ ఎంపీ రాజీనామాతో పెద్దల సభలోకి ఆప్ చీఫ్

ఢిల్లీలో అధికారం కోల్పోయి చట్టసభలకు దూరంగా ఉంటున్న ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. ఎట్టకేలకు రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. పంజాబ్ లూథియాన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆప్ రాజ్య సభ ఎంపీ గెలుపుతో పెద్దల సభకు కేజ్రీవాల్ ఎంట్రీకి మార్గం సుగమమైంది. 

లూథియాన పశ్చిమ నియోజకవర్గం బైపోల్స్ లో ఆప్ అభ్యర్థి, రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరా గెలుపొందారు.  కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ ఆషు పై పది వేల మెజారిటీతో ఆయన గెలుపొందారు. దీంతో ఆయన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయనున్నారు. ఆయన స్థానంలో కేజ్రీవాల్ రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు.

లూథియాన బైపోల్స్ లో అభ్యర్థిగా పారిశ్రామిక వేత్త, రాజ్యసభ ఎంపీ అయిన సంజీవ్ అరోరా (61)ను ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దింపింది. సామాజిక సేవ, ప్రజల్లో ఆయనకు ఉన్న అభిమానంతో కాంగ్రెస్ అభ్యర్థిపై సునాయాసంగా గెలుపొందారు. దీంతో సంజీవ్ అరోరా పంజాబ్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. అదే విధంగా ఆయనకు మంత్రి పదవి ఇస్తామని పంజాబ్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ALSO READ | గుజరాత్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించిన ఆప్..

అయితే ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లేందుకే ఆయనతో రాజీనామా చేయించి అసెంబ్లీకి పంపించినట్లు రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది. ఏదైతేనేం.. చాలా రోజులుగా చట్టసభలకు దూంగా ఉంటూ వస్తున్న కేజ్రీవాల్ త్వరలో రాజ్యసభలో తన గళం వినిపించనున్నారు.