రామ రాజ్యం స్ఫూర్తిగా ప్రజలకు సేవ చేస్తున్నా

రామ రాజ్యం స్ఫూర్తిగా ప్రజలకు సేవ చేస్తున్నా

న్యూఢిల్లీ: ప్రజలకు సేవ చేయాలనే భావన తనలో పెంపొందడానికి రామ రాజ్యం కాన్సెప్ట్ స్ఫూర్తి అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలోని జనాలకు సరైన విద్య, వైద్యం, ఆహారాన్ని అందించడానికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు. ‘నేను శ్రీరాముడు, హనుమంతుడికి భక్తుడిని. ఢిల్లీ ప్రజలకు సేవ చేసే దిశగా రామ రాజ్యం భావనలోని 10 సూత్రాలను అనుసరిస్తున్నాం. ఢిల్లీలోని ఏ ఒక్కరూ ఖాళీ కడుపుతో నిద్రపోవొద్దు. కుల, మత భేదాల్లేకుండా ప్రతి పిల్లాడికి ఒకే రకమైన విద్యను అందించాలి. అలాగే పేద, ధనిక తేడాల్లేకుండా అందరికీ సమాన వైద్యాన్ని అందించాలనుకుంటున్నాం’ అని కేజ్రీవాల్ చెప్పారు.