లగ్గానికి జేసీబీపై వచ్చిన పెండ్లి కొడుకు

లగ్గానికి జేసీబీపై వచ్చిన పెండ్లి కొడుకు

ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ప్రత్యేకమైంది. అందుకే ఈ వేడుకను ప్రత్యేకంగా జరుపుకునే విధంగా ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా ఊరేగింపు డిఫ్రెంట్గా ఉండాలనుకుంటారు. అయితే గుజరాత్లోనూ ఓ పెళ్లి కొడుకు..తన ఊరేగింపు  డిఫరెంట్ ఉండాలనుకున్నాడు.  పెళ్లి మండపానికి  జేసీబీపై ఊరేగింపుగా వచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. 

సాధారణంగా పెళ్లి కొడుకు ఫంక్షన్ హాలుకు కారులోనో..లేదా గుర్రం మీదనో.. లేదా బైక్ పైనో వస్తుంటాడు. కానీ  గుజరాత్‌ నవ్‌సారి జిల్లా కలియారి గ్రామానికి చెందిన కేయూర్‌ పటేల్‌ మాత్రం జేసీబీపై వచ్చాడు.  జేసీబీ ముందుభాగంలో ఉండే వోబాక్స్‌ను అందంగా పూలతో అలంకరించారు ఎండ తగలకుండా పైన పందిరి కూడా వేశారు. ఓ సోఫాను సెట్‌ చేసి..దానిపై కేయూర్ పటేల్ దర్జాగా కూర్చోనొ ఊరేగాడు. జేసీబీ ముంద భాగంలో కేయూర్ పటేల్ కూర్చోగా..వెనకాల అతని బంధువర్గం ఇతర వాహనాల్లో ఫాలో అయ్యారు.  

వివాహ వేడుక పూర్తి కాగానే కేయూర్ పటేల్ తన సతీమణితో కలిసి అదే జేసీబీపై ఊరేగింపుగా తన స్వగ్రామానికి బయలుదేరాడు. జేసీబీ ముందు స్నేహితులు, బంధువులు డ్యాన్స్ లు చేయగా..కొత్త జంట జేసీబీ వోబాక్స్ లో కూర్చోని ఊరేగారు. బుల్డోజర్‌పై ఊరేగింపుగా వెళ్తున్న నూతన జంటను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.