ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. పెన్షన్లు పెంపు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. పెన్షన్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ తీర్మానం చేసింది. జనవరి 1 నుంచి ఏపీలో పెన్షన్ల మొత్తం పెరగనుంది. పెరిగిన మొత్తంతో కలిపి పెన్షనర్లకు 2,750 రూపాయలు అందనుంది. రాష్ట్ర సర్కార్ నిర్ణయంతో దాదాపు 62 లక్షల 31వేల మందికి లబ్ధి చేకూరనుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ మీటింగ్ లో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ట్యాబ్ లు స్వయంగా మంత్రులే ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వైఎస్ఆర్ పెన్షన్ పెంపు, ఆసరా కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొనాలని స్పష్టం చేశారు. గడప గడప కార్యక్రమానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులతో కలిసి సమస్యలు పరిష్కరించాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. అవినీతికి దూరంగా ఉండాలని మంత్రులకు సీఎం సూచించారు.