
వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 14 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు డీఈవో అబ్దుల్ ఘనీ ఒక ప్రకటనలో తెలిపారు. 2022–23 లో నిర్వహించిన ఎగ్జామ్ కు సంబంధించి మెరిట్ లిస్ట్ ను <https://deowanaparthy.weebly.com> వెబ్ సైట్ లో ఉంచామన్నారు.
అభ్యర్థులను రోస్టర్ కం మెరిట్ ఆధారంగా1 :3 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు పిలిచామని పేర్కొన్నారు. జాబితాలో ఉన్న అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో ఈ నెల 23న డీఈవో ఆఫీస్ లో హాజరు కావాలని సూచించారు.