కేజీఎఫ్–2 ట్రైలర్ వచ్చేసింది

కేజీఎఫ్–2 ట్రైలర్ వచ్చేసింది

కన్నడ హీరో యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కేజీయఫ్'. ఈ  సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో యశ్ ఓవర్ నైట్ లో పాన్ ఇండియ స్టార్ గా అవతరించాడు. ఇప్పుడు యశ్ నటించిన కేజీఎఫ్–2 ట్రైలర్ వచ్చేసింది. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ట్విట్టర్‌ వేదికగా ఆదివారం సాయంత్రం కేజీఎఫ్–2 ట్రైలర్ ను విడుదల చేసి.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించింది. ఏప్రిల్‌ 14న ప్యాన్‌ ఇండియా స్థాయిలో  ఈ మూవీ విడుదల కానుంది.

‘ఐ డోంట్ లైక్ వయలెన్స్.. బట్ వయలెన్స్ లైక్స్ మి’అంటూ సాగే డైలాగ్ దుమ్మురేపుతోంది. ప్రకాశ్ రాజ్, సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేశ్ వంటి యాక్టర్స్  ట్రైలర్ లో కనిపించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘ర‌క్తంతో రాసిన క‌థ ఇది. సిరాతో ముందుకు తీసుకెళ్ల‌లేం. ముందుకెళ్లాలంటే మ‌ళ్లీ ర‌క్తాన్నే అడుగుతుంది..’అని ప్ర‌కాశ్ రాజ్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఇక ‘క‌త్తి విసిరి ర‌క్తం చిందించి యుద్దం చేసేది నాశ‌నానికి కాదు.. ఉద్ద‌రించ‌డానికి’ అంటూ అధీరాగా సంజయ్ ద‌త్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. దీంతో యశ్ అభిమానులు సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.