
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో భారత కాన్సులేట్ వద్ద జరిగిన 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఖలిస్తానీ మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారత సంతతి ప్రజలు జాతీయ పతాకాన్ని ఎగురవేసి, దేశభక్తి గీతాలతో వేడుకలు జరుపుకుంటుండగా.. ఖలిస్తాన్ జెండాలు పట్టుకుని భారత్కు వ్యతిరేక నినాదాలు చేస్తూ ఓ గ్రూప్ ఆందోళన చేపట్టింది. దీంతో భారతీయులు భారత్ మాతా కీ జై, వందేమాతరం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ ఘటనతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మెల్బోర్న్లోని భారత కాన్సుల్ జనరల్ కార్యాలయం వద్ద జరిగిన ఈ వేడుకలకు భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాన్సుల్ జనరల్ సుశీల్ కుమార్, స్థానిక ఎంపీ బ్రాడ్ బాటిన్, మారిబిర్నాంగ్ మేయర్ క్రా ప్రదీప్ తివారీ తదితరులు పాల్గొన్నారు.