డెంగీ ట్రీట్​మెంట్​ను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

డెంగీ ట్రీట్​మెంట్​ను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

ఖమ్మం టౌన్, వెలుగు : డెంగీ ట్రీట్​మెంట్​ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతూ పీఓడబ్ల్యూ నాయకులు ఖమ్మం డీఎం అండ్​హెచ్ఓ డాక్టర్​బి.మాలతికి వినతిపత్రం ఇచ్చారు. హాస్పిటల్​లో బాత్రూమ్స్ కు డోర్స్ లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

సదుపాయాలు కల్పించాలని కోరారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ శిరోమణి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.లలిత, టి.ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.