సమస్యల మధ్య చదువులు!

సమస్యల మధ్య చదువులు!

ఖమ్మం సిటీలోని రమణ గుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాఠశాలలో మొత్తం 60 మంది విద్యార్థులు ఉండగా, వారికి సరిపోను గదులు లేవు. పరదాల చాటుకు ఇరుకిరుక్కు గదుల్లో సర్దుకొని చదువులు కొనసాగిస్తున్నారు. కొద్దిగా ఎండొచ్చినా, వానొచ్చినా తిప్పలు మాత్రం తప్పడం లేదు. స్కూల్ ప్రాంగణం బురదమయంగా మారుతోంది.

సరైన బాత్రూమ్ లు, ప్రహరీ లేవు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు కోరతున్నారు. వెంటనే కొత్త స్కూల్ బిల్డింగ్ మంజూరు కొరకు టీచర్లు, విద్యార్థులు వేచి చూస్తున్నారు. కలెక్టర్లు మారడంతో న్యూ బిల్డింగ్ నిర్మాణ ఆశయం అడుగున పడుతోందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం