
స్వాతంత్ర సమరయోధుడు ‘ఖుదీరామ్ బోస్’ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘ఖుదీరామ్ బోస్’ సినిమాను పార్లమెంటు సభ్యుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఢిల్లీ మహాదేవ్ రోడ్డులోని ఫిల్మ్స్ డివిజన్ ఆడిటోరియంలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇటీవలే గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఖుదీరామ్ బోస్ జీవితం గురించి ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్ధేశంతో ఫిల్మ్ మేకర్లు ఈ చిత్రాన్ని రూపొందించారు. జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ జాగర్లమూడి నిర్మించారు. డీవీఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాకేష్ జాగర్లమూడి టైటిల్ రోల్ పోషించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు.