ఇటు తెలుగు, అటు హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న కియారా అద్వాని స్టార్ హీరోయిన్గా వెలుగుతోంది. ప్రస్తుతం ఆమె పర్సనల్ లైఫ్ గురించి గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాని కియారా పెళ్లి చేసుకోనుందని ఇప్పటికే వార్తలొచ్చాయి. పోయిన ఏడాది డిసెంబర్లోనే వీళ్లిద్దరూ ఒక్కటవుతున్నారనుకున్నారంతా. తాజాగా వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్సయినట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఫిబ్రవరి 6న రాజస్థాన్లోని జైసల్మేర్లో కియారా, సిద్ధార్థ్ వివాహం జరగబోతోందట. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో మెహిందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయని తెలుస్తోంది. 2020 నుంచి కియారా అద్వాని, సిద్ధార్థ్ మల్హోత్రాలు డేటింగ్లో ఉన్నారు. మహేష్ బాబు చిత్రం ‘భరత్ అనే నేను’ ద్వారా టాలీవుడ్కి పరిచయమైన కియారా.. ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’చిత్రంలో రామ్ చరణ్కి జంటగా నటించింది. మళ్లీ ఇప్పుడు చరణ్ సరసన మరో చిత్రంలో నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో కియారా ఇంపార్టెంట్ రోల్లో కనిపించనుందని తెలుస్తోంది.